5, జులై 2011, మంగళవారం

WILD SWANS IN TELUGU

Venigalla Komala`s Telugu translation of Wild Swans by Yung Chang is now available as ebook
Please click at this link to down load and read;
http://paradarsi.wordpress.com/2011/07/04/%e0%b0%85%e0%b0%a1%e0%b0%b5%e0%b0%bf%e0%b0%97%e0%b0%be%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%b5%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b1%86%e0%b0%b2/

The Telugu version was acclaimed through reviews and Ranganayakamma, the famous writer published lengthy critical review in Andhra Prabha , Telugu daily and later brought out as book.

30, ఏప్రిల్ 2011, శనివారం

రూపొందిన మానవుడు-హ్యూమనిజం=AGK famous sayings

నేను  – నా ఉద్యమం


Avula Gopala Krishna Murty

    నా  ఉద్యమం – నాతత్వం జాతీయవాదాన్ని, అంతర్జాతీయ వాదాన్ని – వర్గవాదాన్ని మరే యితర సమిష్టి వాదాన్ని అంగీకరించదు.
*             *           *
    వ్యక్తిత్వంతోనే భవితవ్యం

    వ్యక్తిగా వున్న మనిషిని లేక మనిషిగా  వున్న వ్యక్తిని సమాజానికి  మూలంగా అంగీకరించాలి. మానవుణ్ణి  సర్వానికి కొలమానంగా, అధినేతగా చేయాలి. మానవేతర శక్తుల్ని  తీసివేసి, మానవుని భవితవ్యం మానవుని కృషి మీదనే వున్నదని విశ్వాసపూర్వక కృషికి మనం  దిగాలి. ఉమ్మడిని తగ్గించి, వ్యక్తిత్వాన్ని పెంచాలి.
*             *           *
    ఉద్యమం
    పార్టీ  రాజకీయాలు, అధికార రాజకీయాలు, అవకాశవాద రాజకీయాలు, అధికార రాజకీయాల స్థానంలో సాంఘిక రాజకీయాలకు ఉద్యమించాలి.
*             *           *
    మన  కర్తవ్యం
    ఉత్పత్తిని  లాభానికికాక ప్రయోజనానికిగా మార్చాలి. దోపిడీని వర్జించి, సహకార సంబంధాల్ని పెంపొంద  చేయటం మన ముఖ్య కర్తవ్యం.
*             *           *
    మాటలకు, మమతలకు దాసుళ్ళం కాకుండా  మన గలగటం ముఖ్యం.
*             *           *
    అక్షరాస్యత  - నిరక్షరాస్యత
    కేవలం అక్షరాస్యతవల్ల అన్ని సమస్యలూ పరిష్కారం కాకపోవచ్చు. కొత్త సమస్యలను కూడా సృష్టించవచ్చును. అయితే నిరక్షరాస్యత ఏ సమస్యనూ పరిష్కరించలేదు. పై పెచ్చు వాటి పరిష్కారానికి పెద్ద ప్రతిబంధకంగా తయారవుతుంది.
*             *           *
    సమస్యను చూసేదెలా.....
    ఒక  సమస్యను పరిశీలించేటప్పుడు  వుత్పన్నమయ్యే విషయాలపట్ల ఎలాంటి రాగద్వేషాలు చూపక నిష్పాక్షికంగా శాస్త్రీయ  పంథాలో చూడాలి.
*             *           *
విద్యే  సాధనం
    శ్రమను  తగ్గించి, విశ్రాంతినిచ్చే మార్గాలు కావాలి, విద్య అందుకు సాధనం. శాస్త్రీయ ధోరణిలో ప్రబలించటం అవసరం. అది స్వేచ్ఛకు దోహదం చేస్తుంది. స్వేచ్ఛ అంటే, సంఘంలో సమానావకాశాలు కల్పిస్తూ, మనిషిని మనిషిగా చూడగలగటం.
*             *           *
    వ్యక్తి వికాసానికి లలితకళలు
    సంప్రదాయం అంతమై, నవ్యత్వం ఆరంభం కావటానికి, వ్యక్తి వికాసానికి, బహుళత్వానికి తోడ్పడే సరికొత్త నృత్యాలు, లలితకళలు, సాహితీరంగం సాధించాలి.
*             *           *
    దేశాన్నిగాని, వర్గాన్నిగాని కాకుండా  వ్యక్తిని నిర్మాణ విధానాలకు  ప్రాతిపదికగా హ్యూమనిజం  అంగీకరిస్తుంది.
*             *           *
    సత్యమనేది జ్ఞానాంశం. జ్ఞానం సదా పెరుగుతూ వుంటుంది.
*             *           *
    నీతి  దైవికం కాదు. అపౌరుషేయము కాదు, పౌరుషేయము.
*             *           *
    నియంతృత్వం  ద్వారా ప్రజాస్వమ్యాన్ని చేరలేము. ప్రజాస్వామ్యం  పేరుతో అది నిజమైన ప్రజాస్వామ్యం  అయితే నియంతృత్వాన్ని స్థాపించ వీలులేదు.
*             *           *
    పోరాటం  కాని, సామరస్యం కాని వాస్తవికతకు  విరుద్ధాలు. అసలు సంగతి సమన్వయం  చెయ్యటంలో వుంటుంది.
*             *           *
    పదార్థ  జగత్తులోని వివిధ అణువుల సమన్వయ స్వరూప నిర్ణయం మీదనే  సంఘ గమనం జరుగుతుంది.
*             *           *
    విధానాల దాస్యం కోసం వివిధ అణువుల సమన్వయ స్వరూప నిర్ణయం మీదనే  సంఘ గమనం జరుగుతుంది.
*             *           *
    విధానాల దాస్యంకోసం స్వేచ్ఛకు అవరోధాల్ని సహించకూడని ప్రశస్త గుణాన్ని మనం అలవఱచుకోవాలి.
*             *           *
    హ్యూమనిజం
    హ్యూమనిజం ప్రజలలో నమ్మకం కలిగి మానవకోటి మీద విశ్వాసంతో, సత్యాన్వేషణకు  శాస్త్రజ్ఞానం అవసరమని  భావిస్తూ, సాహిత్యం ద్వారా, కళల ద్వారా, శాస్త్ర విజ్ఞానం, తత్త్వ విద్యల ద్వారా నైతిక ధార్మిక విలువలను గ్రహించి, జీవిత సమగ్రత్వాన్ని పొంద ప్రయత్నిస్తుంది.
*             *           *
    ప్రజల, ప్రభుత్వాల మధ్య తాబేదారులు  ఈ రాజకీయ పార్టీలు, వాటిలో ప్రజాస్వామ్యం ఎండమావులలో నీరులాంటిది.
*             *           *
    వ్యుత్పత్తి, మారకం, పంపిణీలలో ప్రయివేటు  ఆస్తుల్ని రద్దు చేసినంత  మాత్రాన లోకాస్సమస్తా స్సుఖినోభవన్తు కాగలగటం భ్రాంతి అని అనుభవంలో తేలిపోయింది.
*             *           *
    యే ప్రభుత్వం ఎంత తక్కువగా పరిపాలిస్తుందో అదంత మంచి ప్రభుత్వం అన్నారు విజ్ఞులు. మనం శ్రద్ధగా ఆలోచన చెయ్యాలి. సాంఘిక సమస్యలు వొకనాడు పుట్టవు. సాంఘిక వికారాలు పోవాలంటే చాలాకాలం పడుతుంది. అది యెక్కడైనా అంతే.
*             *           *
    పిల్లలు మాధుర్యాన్ని చిమ్ముతారు.
*             *           *
    జీవితాన్ని  మధుమయం చెయ్యటానికి కావ్యం ఉపయోగపడాలి.
*             *           *
    వ్యక్తిగా వున్న నన్ను నేను జాగర్త చేస్తే నా చుట్టూ వున్న జగత్తు యధామాతృకంగా మరమ్మత్తు  అవుతుంది.
*             *           * 
    భావమంటే......
    భావానికి  బలం వున్నది. భావానికి రెక్కలు  వున్నవి. భావము పదార్థము. భావము ఒక్కసారి జన్యము కాగా దానికై అదేమనుగడ సాగించుకొనగల నైజాన్ని కలిగి వుంటుంది అన్న పదార్థ భావుకత కలిగినవాడు శాస్త్రీయ పరిశీలకుడు.
*             *           *
    ప్రైమరీ, సెకండరీ, యూనివర్సిటీ స్థాయీలలో  విద్యకు సమన్వయం జరగటం  మన విద్యాపద్ధతుల్లో ఆరోగ్యకర వాతావరణాన్ని నెలకొల్పుతుంది.
*             *           *
    పూర్వం చంచల్ చంచలోపమని సామెత వున్నది. మెరుపు తీగలు యెంతగా చలిస్తవో అంతగా చలించేది. నేడు నారీలోకం కాదు. రాజకీయ రంగం.
*             *           *
    మానవ  ప్రవర్తన
    యుద్ధం  మానవ ప్రకృతి విరుద్ధం, మానవుడు  హేతుశాలి, అందువల్ల ప్రాయికంగా శాంతివాది, అందువల్ల అశాంతిని శాంతిగా మార్చాలని తాపత్రయ పడతాడు. మానవునిలో మానవత్వం దీనికి కారణం. మానవ ప్రవర్తనకిది గీటురాయి.
*             *           * 
    యుద్ధోన్మాదులకు యుద్ధం అవసరం. ప్రజలుగా వున్న  మనకు అనవసరం. సిద్ధాంత ఉన్మాదులకు యుద్ధం ఆటస్థలం. ప్రజలుగావున్న మనకు గిట్టదు. మతోన్మాదులకు యీ యుద్ధం విహార స్థలం. మనకది మారణహోమం, పనికిరాదు.                    
*             *           *
    పాతకొత్తలు
    పాతదృక్పథాలు  చినిగిపోకుండా, క్రొత్త  సిద్ధాంతాలు పాదుకోకుండా  వున్న సంధియుగంలో వున్నాము. ఇది ప్రాయికంగా సంఘర్షణయుగం  కూడా. ఇంకా మనం పాతకొత్తల  మేలుకలయికదాకా రాలేదు. ఆ  పరిణామానికి పొలిమేరల్లోనే  వున్నాము.
*             *           *
    వ్యక్తిత్వం - సమాజం
    పాశ్చాత్య ప్రాచ్యమత చరిత్రలన్నీ  ఒకే తీరున నడిచినవి. మానవుని  వ్యుత్పత్తిని, సమాజ వ్యవస్థా నిర్మాణాలను మతవాదులు ఒకరీతిగా భావించారు. విజ్ఞానశాస్త్రం  మరో రీతిగా పరిగణించింది. వ్యక్తిగా పరిగణనజరిపి, వ్యక్తుల సమూహాన్ని భావించి, వ్యక్తికి సమాజానికి వున్న, వాద భేదాలుగా రూపొందినవి.
*             *           *
    సమస్యల  నుంచి పలాయనం చేయటం పనితనం కాదు. ఎదిరించి, పెనుగులాడి సమస్యా పరిష్కార మార్గం అన్వేషించాలి.
*             *           *
    భావ విప్లవం విప్లవాలలోకల్లా  కష్టం. అందువల్ల మార్పు చాలా నెమ్మదిగా, తక్కువగా సాగుతుంది. పదికాలాలపాటు మొండికేయంది  పనికాదు. 
*             *           *
    సాంఘిక  సిద్ధాంతాల నిర్మాణం
    అన్ని పోరాటాలలోకల్లా సాంఘిక పోరాటం కష్టమైనది. భావపోరాటం యిందులో  ప్రధానపాత్ర వహిస్తుంది. భావ విప్లవంరాంది, తతిమ్మా  విప్లవాలు – సాంఘిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతికాలు – నెగ్గవని యం.యన్.రాయ్ వచించి, ఆ భావ పునాదుల మీద సాంఘిక సిద్ధాంతాల్ని నిర్మించాడు.
*             *           *
    దిగజారిన  వర్ణవ్యవస్థ
    వర్ణవ్యవస్థ కులవ్యవస్థగా దిగజారి, నాలుగు వర్ణాలు నాలుగువందల కులాలుగా మారిపోయి, దేశం వర్ణాల, కులాల  దేశంగా కరుడుగట్టి కూర్చుంది. ఆ పాకం సడలకపోగా, చిట్టెం  కట్టిపోయింది. ప్రాయికంగా జనానీకంలో నూటికి తొంభైమందికి  పై దాకా యీ మౌఢ్యం పోలేదు. ఇదిపోయి  తీరాలి.
*             *           *
    రూపొందిన  మానవుడు
    మానవుని మానవునిగా చూచి, చిత్రించి, లేవదీసి, కాళ్ళమీద నిలబెట్టి, ఆవులింతలు పోగొట్టి, అదుపు  ఆజ్ఞల నెరిగిన మానవులను తయారు చేయగలిగిన ఉద్యమాలు, నాయకులు, తత్వవేత్తలు చొరవతో ముందుకు రావటం అభిలషణీయం.
*             *           *
    తూర్పు  మొనగాడని గర్వించిన వారూ – తూర్పువేరు, పడమర వేరన్నవారూ ఒకే కోవకు చెందినవారే.
*             *           *
    వినాయక  నాయకులు
    మేఘాలు  ఆవరిస్తే, వర్షం పడుతుందని  భ్రాంతి పడతాము. నాయకులు  ఘీంకారాలు చేస్తుంటే, మత్తేభనృత్యం జరుగుతుందని భావిస్తాము. అవి తెల్లమేఘాలే అయి, వీరు వినాయకులే అయితే మన అంచనాలు తప్పటం జరుగుతుంది.
*             *           *
    నేను  నేనే, మరొకడిని కాననే భావం వ్యక్తిత్వ వికాసానికి పునాది. నా వుద్దీపనలో నేను సర్వస్వతంత్రుణ్ణి  అనే భావం స్వేచ్ఛా సమాజ నిర్మాణానికి ప్రాతిపదిక. 
*             *           *
    కవిరాజ  సృష్టి
    కవిరాజు రామస్వామి ఒక వారసత్వానికి ప్రతినిధి. తెలుగునాట వేమనతో ప్రారంభమైన సాంఘిక ప్రగతి వుద్యమంలో సేదదీరినవాడు కందుకూరి వీరేశలింగం. సాంఘిక తిరుగుబాటను సమర్థిస్తూ, ఆ వుద్యమాన్ని సర్వతోముఖంగా విస్తరింపజేసి, తాత్విక  భావ పరంపరలను బహుధా సృష్టించినవాడు కవిరాజు.
*             *           *
దృష్టిదోషం
    మన  ఆలోచనలు, మాత్సర్యగ్రస్తంగా  వుంటున్నవి. విషయ పరిశోధన, నిర్ణయాలవద్ద మాత్సర్యదృష్టి ఉండటం వల్లనే తెలుపు నలుపుగా నలుపు తెలుపుగా మారుతున్నవి. నిష్పాక్షికత లేకుండా పోతున్నది. మనకీ దృష్టిదోషం పోవాలి.
*             *           *
    స్వేచ్ఛాపూరిత మానవులతో కూడిన స్వేచ్ఛాయుత  సమాజనిర్మాణమే నా గమ్యం. 

29, ఏప్రిల్ 2011, శుక్రవారం

అచరణకో ఆణిముత్యం- AGK


    తీర్మానాలు  - సిద్ధాంతాలు

AGK playing games
AGK enjoying while playing games with villagers
    నా  తీర్మానాలకు, సిద్ధాంత నమ్మకాలు ప్రధానాలు. నా సిద్ధాంతం నాకు నచ్చినట్లు యితరులకు నచ్చకపోవచ్చు. కొందరకు నచ్చినా అది శ్రేయస్కరమైన సిద్ధాంతం కాక పోవచ్చు. అందువల్ల నా తీర్మానాలను యింకొకరి మీద రుద్దటం అంటే నా సిద్ధాంతాలను పరాయివారి మీద రుద్దటమే అవుతుంది. అందువల్లనే జాగ్రత్త అవసరం. అంతే కాదు సిద్ధాంత విశిష్టతలకు విప్పారిన హృదయాలతో వ్యక్తం చేసుకోవాలి. అన్వయం చేసుకోవాలి. అన్వర్థం చెయ్యాలి.
*             *           *
    స్వేచ్ఛా  వాతావరణం
    మనిషిని మనిషిగా మననివ్వగల స్వేచ్ఛా వాతావరణాన్ని సృష్టించాలి. మనిషిని కొరముట్టుగా కాక ఒక ధ్యేయంగా యెంచి ప్రచారం సాగించి, నా చుట్టూ వాతావరణాన్ని బూజులు దులిపి స్వేచ్ఛకు పునాదులు త్రవ్వాలి.
*             *           *
    హేతువాదం  - నీతి
    మతపిచ్చి  రెచ్చి మానవుణ్ణి మరగా చేసి ఆసేతురూ వినాయకుణ్ణిగా  చేస్తుంది. అడ్డం తిరగాలి. అడ్డీలు వేయాలి. యీ మత ప్రచార వాహినులకు బ్యారేజిలు కట్టించాలి.
    దేశమంటే కేవలం మట్టిగాదు. దేశమంటే  కేవలం మనుజులు కాదు. కండగలిగి వుండటమే, మానవతకు కారణం  కాదు. చైతన్యం కావాలి. నీతికావాలి. నీతి హేతువుచే ఉత్పన్నమయ్యేది, హేతువాదమే నీతి అంటే, హేతువాది కానిది చైతన్యం కాదు. వ్యక్తిత్వంలేనిది హేతువాది కాజాలడు. మానవత్వం ఆసరాగా వుంటే తప్ప వ్యక్తిత్వం నిలవదు.
*             *           *
    జాతితో, మతంతో, మౌఢ్యంతో, ఆచారంతో  నీతిని నేర్పలేం.
*             *           *
ప్రజాస్వామ్యం
    ప్రజాస్వామ్యాన్ని పార్టీ స్వామ్యం ద్వారా నిలుపలేము. ఎన్నికల్లో జరిగే ఓట్ల కొనుగోలుతో ప్రజాస్వామ్యం ధన స్వామ్యంగా మారిపోతుంది.
*             *           *
ద్విజిహ్వత్వం
    పాములకు రెండు నాలుకలు వుంటై, ద్విజిహ్వలని సంస్కృతీకరించాము. మనిషికి  ఒకే నాలుక ఉన్నా ద్విజిహ్వత్వాన్ని  – కాదు – బహుజిహ్వత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. పాముకన్నా యిట్టి నాలుకలవాళ్ళు అత్యంత ప్రమాదమౌతున్నారు. మనిషేకాదు పార్టీలకు కూడా ద్విజిహ్వలు ఏర్పడుతున్నవి. దాంతో నా చుట్టూ ప్రపంచం కల్లోలాన్ని పొందుతున్నది. అట్టి కల్లోలాన్ని నివారించటం  మన కర్తవ్యం.
*             *           * 
పార్టీలు  లేని వికేంద్రీకృత పాలన
    హేతుగుణం  వ్యక్తిత్వం, సామాజికం కాదు. ఆలోచనాశక్తి హేతువుకు పునాది. అందువల్ల జాతీయత, కమ్యూనిజం, ఫాసిజం, సోషలిజం వగైరా సిద్ధాంతాలన్నీ సమిష్టి భజనలు. అవి వ్యక్తి వికాస ప్రాదుర్భావానికి వ్యతిరేకాలు. పార్టీలు సమిష్టి కృతులుగా హేతువాదానికి భిన్నాలు, వ్యతిరేకాలు, అందువల్ల పార్టీలు రద్దు చేయాలంటాము. పార్టీలు లేని వికేంద్రీకృత పాలన కావాలంటాము.
*             *           *
    మనవారసత్వం
    మనకు  పూర్వులు నేర్పిన కొన్ని దుర్గుణాలు వున్నై. మనకూ, మరొకనికి విరోధంగా వుంటే వుభయులకూ సమానంగా యెవ్వరం స్నేహితులుగా వుండ వీలులేదు.  నాకే స్నేహంగా వుండాలంటాము. నాకు స్నేహంగా, నా విరోధికి విరోధిగా వుండకపోతే, నాకే విరోధిగా వారిని నిర్ణయిస్తాము. యీ రోగం మనవారసత్వం.
*             *           * 
    స్వాతంత్ర్యేచ్ఛ
    దేశభక్తి  గీతాలకన్నా, స్వాతంత్ర్యేచ్ఛమీద జాగృతిక దృక్పథం అవసరం. దేశభక్తి పేరుతో మతోన్మాదులు కీడు తేవచ్చు. పరదేశభక్తి పేరుతో సిద్ధాంతోన్మాదులు కీడు తేవచ్చు. స్వాతంత్ర్యేచ్ఛ, స్వేచ్ఛా పిపాసలు పునాదులుగా  వుద్యమం నడిపించాలి.
*             *           *
    అవినీతిని మరో అవినీతితో ఎదుర్కోరాదు. అవినీతిని అవినీతితోనే  కొట్టగలం.
*             *           *
యుద్ధం
    యుద్ధం  కావాలని నేను కోరను. యుద్ధం వస్తే నాకు యిష్టం లేకపోయినా, నాకంత భయమూ లేదు. యుద్ధం కావాలని  నేనంటే నేను యుద్ధోన్మాదిని. యుద్ధం యెవరో తెచ్చి నా నెత్తిన పెడితే, దాన్ని చూచి నేను కంగారుపడితే నేను పిరికివాడిని. నాకండ్లలో పిరికితనం లేదు. నా రక్తంలో వుడుకుతనం లేదు.
*             *           *
    మతాలు
    మతాలు మానవ వికాసానికి ఆరంభంలో  కొంత వుపకరించినా, రోజులు గడవగా, ప్రతిబంధకాలుగా తయారైనై. దానివల్ల మానవుని వ్యక్తిత్వం శూన్యత్వంలో కలసిపోయింది. బుద్ధుడు ఆ మానవుని వ్యక్తిత్వాన్ని పునరుద్ధరించాడు. మానవుడు చేయవలసింది దేవునికి వూడిగం కాదు. మంచి ప్రవర్తనతో నాన్యతో దర్శనీయ వికాసాన్ని పొందవచ్చునన్నాడు. మనమే మన పనులకు ఉత్తర వాదులమన్నాడు. కర్మను, వేదాలను, పారలౌకిక పాపపుణ్యాలను, కులాలను, మతాలను ఒక్కసారిగా డుల్లిపుచ్చాడు. లోకం విహ్వలించి, గౌతముణ్ణి బుద్ధుడన్నది. ఆ బుద్ధుడు అహింసావాదానికి కాణాచి.
*             *           *
    మనకు  మంచి ఆదర్శం వుండాలి. మనకున్న  మంచి ఆదర్శం ఆచరించడానికి మంచి వ్యక్తులు వుండాలి. ఆదర్శాన్ని త్వరలో అందుకోడానికి మంచి సంస్థ వుండాలి.
*             *           * 
    చట్టాలు కావాలి. చట్టాల్ని అనుసరింపజేయగల  సహృదయతగల జనాంగాలు కావాలి.
*             *           * 
    అస్పృశ్యత
    పూర్వం  ఉన్న సాంఘిక అస్పృశ్యతస్థానే  యిప్పుడు వచ్చే రాజకీయ అస్పృశ్యతను  మనం తేలికగా అర్థం చేసుకోవచ్చు. సాంఘిక అస్పృశ్యత నశించాలని మనం నిర్భయంగా అంటాము. అట్లాగే రాజకీయ అస్పృశ్యత నశించాలి అని మనం నిర్భయంగా అనాలి.
*             *           *
    మనిషి మారుతున్నాడు. మనుగడ మారుతోంది. వ్యవహార వ్యాసంగాలు తాత్విక  వైజ్ఞానిక దృక్పథంవైపు  మలుపు తిరుగుతున్నవి. కాని సాంఘిక జీవనంలోని నిమ్నోన్నతాల దూరం లేకుండా పోవటానికి  ఆశించినమార్పు జరగకపోవటం  శోచనీయం. ఆలోచింపతగ్గ విషయం.
*             *           *
    మానవుని స్వేచ్ఛను హరించే చట్టం, అదెంత ఉత్తమ లక్ష్యంతో  కూడుకున్నదైనా మూర్ఖులు సమర్థించవలసిందే గాని హేతువాదులు అంగీకరింపజాలరు.
*             *           *
    మానవునిలో మానవుని, సమాజంలో మానవుని, ప్రకృతిలో మానవుని ఆవిర్భావానికి  మన ఉద్యమం సాగాలి. అందుకుగాను మనం విజ్ఞాన చంద్రికలను వెదజల్లాలి.
*             *           *
    వికేంద్రీకరణ
    రాజకీయ  రంగములో కేంద్రీకృత విధానములపై పెత్తనము పోయి, ఆర్ధిక విషయాలలో కేంద్రీకృత విధానాలు ఉంచేటట్టు  చెయ్యటం విడ్డూరంగా వుంది. అన్ని రంగాలలోనూ వికేంద్రీకరణ జరిగి సామాన్య మానవుని శ్రేయస్సే కొలబద్దగా కృషి జరగాలి.
*             *           *
    వర్ణం, వర్గం, కులం, మతం, జాతి, వర్గం  ఇవన్నీ సమిష్టి భావనలు – సంకుచిత భావనలు – వ్యక్తి అయిన మానవుని కుంచింప చేసేందుకు ఏర్పడ్డ కృతక వలయాలు. వీటిని అధిగమించాలి.
*             *           *
    మన  రాజ్యాంగం షెడ్యూలులో వున్న  అన్ని భాషలనూ ఆంగ్లంతో సహా  జాతీయ భాషలుగా పరిగణించటమే  మన భాషా సమస్య పరిష్కారానికి  హేతుబద్ధమైన మార్గం.
*             *           *
    రాజకీయ, ఆర్థిక, సాంఘిక విప్లవాలకు, హేతుబద్ధ సంస్కరణలకు మూలకందం  తాత్విక విప్లవం. తాత్విక  విప్లవం వెనక – మిగిలినవి ముందు అనటం హేతుబద్ధం కాదు.
*             *           *
    మతం నల్లమందు వంటిదని కారల్  మార్క్సు అన్నాడు. మతంతోబాటు  రాజకీయపార్టీ కూడా నల్లమందువంటిదేనని హ్యూమనిస్టులము అంటాము.

26, ఏప్రిల్ 2011, మంగళవారం

UNIQUE SAYINGS OF AGK= quotable quotes

పెరుగుతున్న జ్ఞానం మనలో కొత్త తరహా నైతిక విలువలకు ఒరవడి దిద్దుతుంది.
వ్యక్తికి మించిన సంఘం లేదు. వ్యక్తికి మించిన దేశం లేదు. వ్యక్తిభద్రతతో సమిష్టి శ్రేయాన్ని కోరే రాడికల్ ప్రజాస్వామ్యబాట యీ యుగంలో స్వేచ్ఛామార్గం. మానవుడు సాంఘిక జంతువు స్థితినుంచి బయటపడి, ఆర్థిక జంతువుగా తయారు కారాదు.
*             *           *
మానవుడు సాంస్కృతిక జీవి. అట్టి సాంస్కృతిక జీవుల్ని తయారు చెయ్యటమే యీ యుగ సమస్య. వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి వికాసం ప్రజాస్వామ్యానికి కీలకాలు. జాగృతి దానికి రక్షణ. యివి దృష్టిలో పెట్టుకుని మన పంచాయితీ రాజ్య పరిపాలన జరగాలి.
*             *           *

ప్రజాస్వామ్య నిర్మాణాలు సమాజంలో పై నుండి క్రిందికి రావు. క్రిందినుండే పైకి పెరుగుతై. పెరగాలికూడా. అధికారానికి, ప్రజలకు మధ్య అంతరం తగ్గటం, మధ్య బేరగాళ్ళు లేకపోవటం ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు.
*             *           *
మన దేశంలో వివాహచట్రంలో కులతత్వం పేరుకొని, కరుడుగట్టింది. మనం దీనిని బ్రద్దలు చెయ్యాలి. లేకపోతే సాంప్రదాయబద్ధమైన సాంఘిక శృంఖలం నుండి మనకు విమోచనం కలుగదు.
పంచాయతీ రాజ్య నిర్మాణం అత్యుత్తమ స్థానిక వ్యవస్థ. పాలనా యంత్రాన్ని వికేంద్రీకరణ చెయ్యాలి అన్న భావం వుదాత్తమైనది.
*             *           *
అధికార వ్యామోహ రాజకీయాల నుండి మానవుణ్ణి, మానవ సంఘాన్ని తప్పించితే తప్ప, మానవుని భవితవ్యం యుద్ధమయం కాక తప్పదు. కాబట్టి ప్రతివ్యక్తి శక్తివంచన లేకుండా యుద్ధాన్ని ఆపటానికి కృషి చెయ్యాలి.
*             *           *
భాషకు జాతిలేదు. వర్గంలేదు. వర్ణం లేదు. అది మానవవేద్యమై, ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి వాడుకునే కొరముట్టు. అందువల్ల భాషలకు అంటులు, ప్రాంతీయతలు, దేశీయతలు ప్రవేశపెట్టటం వాంఛనీయంకాదు, ప్రాచీనతల త్రవ్వటం యోగ్యమైన పని కాదు. సంఖ్యావాచకాలను ప్రసరింపజేయటం విజ్ఞమైన పనికాదు.
*             *           *
సాహిత్యానికి, జీవితానికి అవినాభావ సంబంధంవుందని నా విశ్వాసం. సాహిత్యం లేకపోతే జీవితంలేదు.
*             *           *
మతతత్వం కులతత్వాన్ని దింపింది, పెండ్లి వ్యవస్థతో అది కుదురుకుని, వ్రేళ్లు తన్నింది. ఇది పునాదులతో సహా కదలిపోవాలి.
దేశం మనదైనంత మాత్రాన, ప్రభుత్వం మనదైనంత మాత్రాన పత్రికా రచయితలు ఆ రెంటికీ తాషామర్పా రాయుళ్ళుగా వ్యవహరించటం తగదు. జీవితానికి విమర్శ వెలుగు. పత్రికా రచయితలు విమర్శకు జ్యోతులు, స్వరాజ్యం వచ్చింది గనుక జరిగే మాయాబజారును కప్పిపుచ్చి, ప్రజల భవితవ్యానికి వురిత్రాళ్ళు మనకుగాను మనమే తయారు చేసుకోజాలము. సత్యాన్వేషణ, స్వాతంత్ర్య పిపాస, సర్వసమానత్వం మనకు ధ్యేయము కావాలి.
*             *           *
సాంప్రదాయ బద్ధత అనేది విడనాడాలంటే ఉపరి భాగాన్ని చికిలీ చేస్తే సరిపోదు.  చికిలీ అడుగు మట్టాన్ని సైతం కదిలించివేయగలగాలి.
*             *           *
సాంప్రదాయత అనేది మానవుని మతపూరితమైన అడవిజంతువుగా మారుస్తుంది.
*             *           *
శాస్త్రమూ, శాస్త్రీయ దృక్పథమూ అనేవి మాత్రమే సాంప్రదాయక ప్రామాణికతలనే వాటిని బదాబదలు చేసి అభివృద్ధి సోపాన ప్రాయాలు కాగలవు.
*             *           *
సాంప్రదాయికతను భేదించాలంటే, మార్గమేమిటి? ఆ మార్గ విద్య – ప్రధానంగా శాస్త్రీయ విద్య.
కులాంతర, మతాంతర, రాష్ట్రాంతర వివాహాలు సాంప్రదాయం అనే ఘనీభవించిన మంచుగడ్డను ముక్కలు చేయగలవు.
*             *           *
ఆధునిక సమాజ రీతులు పై  కొనాలంటే, సనాతన సాంప్రదాయ భావాలు తొలగిపోవాలి. ఆ మేరకు మనం కృషి గట్టిగా సాగించాలి.
*             *           *
మతం వ్యక్తిగత విషయంగా వుండాలి. ప్రభుత్వ స్థాయిలో మత ప్రచారం జరగటం ఎంతో ప్రమాదకరం. దానివల్ల ప్రజాస్వామ్య మనుగడకే ముప్పు కలుగుతుంది.
*             *           *
ప్రజలు తమతమ పనులను, విధులను బాగా చేసుకోగలరనేదే ప్రజాస్వామ్యపాలనకు మూలం. ప్రజలవల్ల కాదు, ప్రభుత్వం తనకు తానుగా పనుల నిర్వహణ జరిపించాలి అనుకునేది ప్రజాస్వామ్యం కాదు. అది ప్రజల పేరుతో జరిగే పాలన. ప్రజల పేరుతో జరిగేది, అడుగులు సాగినకొద్దీ నియంతృత్వంలోకి లాగుతుంది. ఒక్కసారి నియంతృత్వం కుదురుకొనెనా, అది సర్వకాలానికి పాదుకుపోవాలని పెనుగులాడుతుంది. దాంతో ప్రజాస్వామ్యం నశిస్తుంది.
వ్యక్తిత్వం వమ్ము కాకుండా సంఘంలో వ్యుత్పత్తి తసరబు అయ్యేటట్టు చూడవలసి వుంది.
*             *           *
బుద్ధుని సిద్ధాంతాలు తిరగరాయాలి. నేడు మనకు కావలసిన మానవత ఆయన నుండి గ్రహించాలి.
*             *           *
నీతిని మోక్షానికి, మతానికి అంటగట్టకుండా మనిషికే అన్వయించాలి.
*             *           *
నీతిభయంవల్ల, భక్తివల్లరాదు. వచ్చినా నిలవలేదు. నీతి చైతన్యంవల్ల రావాలి. చైతన్యం వ్యక్తికం.
*             *           *
పాపాణపాక ప్రభుత విశృంఖల విహారం చేస్తున్నది. మనం జాగరూకులమై మెలగాలి.
*             *           *
క్రింది నుండి చైతన్యం రావాలి. పరివర్తన జరగాలి. సాంఘిక విముక్తి ఉద్యమం సాగాలి.
*             *           *
మౌఢ్యాన్ని బ్రద్దలు కొట్టాలంటే విజ్ఞానం మార్గం కాని నియంతృత్వం మార్గం కాదు, మార్చటం మార్గం కాని మొత్తటం కాదు, జాగృతి మార్గం – కాని నియతం చేయటం కాదు.
మంత్రిపదవుల్లో దేవాలయ ధర్మాదాయశాఖ వుండరాదు. ఒకస్టాటరీబాడీ వుంటేచాలు.
*             *           *

లోకం ఆజ్ఞగా, విజ్ఞంగా, మిశ్రమంగా వుంటుంది. విజ్ఞులకు ఒక ప్రగాఢ బాధ్యతవుంది. అది అజ్ఞ లోకాన్ని ప్రయోజనాత్మక దృష్టికల దానినిగా చేయటం, మిశ్రగతిలోని వారిని మందలించి మంచిగా మార్చటం, అయితే ఆజ్ఞలోకానికి మోతాదు హెచ్చుకావలెను.
*             *           *
సాంఘిక, మానసిక వర్తనలు భావదీప్తి పెంపొందిన గాని రావు. భావవిప్లవాలు, అన్ని పరివర్తనలకు నాందీ ప్రస్థావనలు. భావవిప్లవ కృషికులు స్వేచ్ఛాన్నేషణాసక్తులు.
*             *           *
కవి యెప్పుడైనా చేయబడతాడుగాని, పుట్టడు. అయితే కొందరిలో యిమిడే శబ్దపాటవాన్నిబట్టి శ్రావ్యత అబ్బుతుంది. కొందరికది అబ్బదు. అబ్బినవాణ్ణో పుట్టుకవిగా, అబ్బని వాణ్ణి చేతకవిగా వర్ణించుట పరిపాటిగా వుంది లోకానికి, అది న్యాయంకాదు.
*             *           *
మనది నిచ్చెనమెట్ల సమాజం. ఉచ్ఛనీచాలతో అసురుసురౌతున్నది. అంతరాలతో దిగజారుడు లేని నూతన సమాజ నిర్మాణం మనధ్యేయాల్లో వొకటి.
*             *           *
తప్పును మరొక తప్పుతో దిద్దలేము. తప్పును ఒప్పుచేయటం విజ్ఞానానికి మార్గం, శాస్త్రానికి రీతి, చరిత్రకోబాట. నా చుట్టూ ప్రపంచం ఎంత గింజుకున్నా, మన మార్గం మాత్రం శిష్టంగా వుండాలి.
*             *           *
ఒకడు తప్పు చేసి గూడా, దానికి కారణం యింకొకరి మీద రుద్దటానికి ప్రయత్నం చేస్తాడు. యింకొకడు యితరుల తప్పునుగూడా తన నెత్తిమీద రుద్దుకుంటాడు. మరొకడు తన తప్పు తన మీదికి రాకుండా చూచుకుంటాడు. యిటువంటి ప్రవృత్తి అందరి మానవుల్లోనూ వుంది. కొందరు వాటిచేత పని బాగా చేయించుతారు. మరికొందరు జాగర్త చేస్తారు. యీ శావాస్యోపనిషత్తు నుంచి సుమతీ శతకం దాకా యీ భావాల్నే చెప్పారు. దాన్నిబట్టి మన వేదాంతులు వుత్తమ, మధ్యమ, నీచాధికారుల్ని నిర్ణయించారు. ఈనాటి రాజకీయరంగంలో యిదే కనబడుతుంది. అయితే చూడాలి. చూచినట్లు కళ్ళు తెరిస్తే లాభం లేదు.
*             *           *
మితిమీరిన జనాభామను కనుట నైతికంగా మంచిదికాదు. సాంఘికంగా చిక్కులు మీరి వ్యవహారం రాజకీయంగా ప్రభుత్వాన్ని సమస్యలలో మ్రగ్గచేయటం అవుతుంది. సాంఘిక న్యాయం కావాలని, చేకూర్చాలని కోరేహక్కు మనం చేయవలసిన చేయదగిన పనులు చేయటంలో వుంటుంది.
చేయవలసిన పని చేయటానికి జంకే వారివల్ల యెక్కువ కీడు సంఘానికి వస్తుంది. రాజకీయంగా, సాంఘికంగా, ఆర్థికంగా యిట్లాగ నీకు, నాకు, మనందరికి అన్యాయం జరుగుతూ వుంటుంది. యెవడి అన్యాయం వాడు చెప్పితే స్వార్థమంటారు, వొకడి అన్యాయాన్ని గూర్చి యింకొకడు చెప్పితే నిష్కామకర్మ అంటారు.
*             *           *
ప్రధానంగా స్త్రీ పురుషులంతా మార్గాన్వేషణ చెయ్యాలి. మార్గాన్వేషణకు విషయ పరిజ్ఞానం కావాలి. విషయ పరిజ్ఞానాన్ని ఆధారం చేసుకుని చైతన్యం పొంది, ఆ పొందిన చైతన్యాన్ని మార్గాన్వేషణకు మలచుకోవాలి. పూర్వాచారాల్ని వర్తమానానికి అడ్డుపెట్టి భవితవ్యాన్ని చిక్కుల్లో పెట్టరాదు. రానున్న తరాల అభ్యున్నతికోసం కలవరపడాలి.
*             *           *
ఒక వాతావరణం సమాజంలో సృష్టింపబడాలి. ఉద్యమానికి చేయూత నిచ్చేవారు. ప్రచారకులు వారి వారి అనుభవాల్ని నిరాఘాటంగా చెప్పుటకు సిగ్గుపడరాదు. ప్రభుత్వము వైపుకు చూడకుండా నేను యిప్పుడు యిక్కడే యేమి చేయగలనో అది చేయాలన్న దీక్షాపరుల సంఖ్య ప్రాంతప్రాంతాల్లో పెరగాలి.
*             *           *
మానవుణ్ణి తోటి మానవుడు నమ్మక, తాను తోటివానికన్నా ప్రతిభుడని అహంకరించి, తన ఆలోచన మీదనే లోకం నడవాలని భావించి, మానవునిలోని వికారాల్ని రెచ్చగొట్టి, అధికారాన్ని చేబట్టి నియంతలుగా తయారౌతున్నారు. అది పోవాలంటే, మానవునిలో నమ్మకం కుదిరే విధానం వుండాలి.
*             *           *
మానవుడు ప్రాయికంగా హేతువాది. అందువల్లనే అతనిలోని హేతుత్వం పెరగగల విధానంలో అతను నైతికకీలిగా వుండగలడు. నీతికి అతని హేతువేచాలును. దేవుడు అవసరం లేదు. మతం అవసరంలేదు. యితర మందులు అవసరం లేదు.
*             *           *
ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛపునాది. స్వేచ్ఛకు భావ స్వాతంత్ర్యం మూలకందం, భావస్వాతంత్ర్యానికి వికారాలు లేని వ్యక్తులు మూలం. వ్యక్తివికాసం సమాజానికి భూషణం.
*             *           *
చిన్న పెద్దరికాలకేమిగాని, చేయనెంచినది చెప్పి, చెప్పినది చేయగలిగిన  నాయకత్వం వుంటే కథాకథనవృత్తి మారుతుంది. చిత్తశుద్ధిగల రాజకీయ, సాంఘిక వాతావరణం కావాలి.
మనపని మనం చేసుకొని పొరుగువాళ్ళ కొంపలకి ఎసరు పెట్టని వాతావరణం కావాలి. కాబట్టి అట్టి వాతావరణంతో గుణైక మార్పుగల ప్రకృతి అవసరం, దానికే నా చుట్టూ ప్రపంచం పరిశీలించాలి, ప్రయత్నించాలి, పయనించాలి. అపుడు సమస్యాపరిష్కారం జరుగుతుంది. 
*             *           *
వెనుకబడిన జాతుల ఉద్యమమంటే సాంఘిక విముక్తి ఉద్యమంగా నేను భావిస్తాను.
*             *           *
సాంఘిక దౌష్ట్యభావాలన్నీ పునర్వ్యవస్తీకరణ పొందందే, నూతన సాంఘిక దృక్పథం రాందే యీ భావ విప్లవం జరుగదు. వెనుకబడిన జాతుల ఉద్యమానికి ముందు ఒక భావవిప్లవం జరగాలి. యీ సాంఘిక తాత్విక విప్లవాన్ని ఆర్థికత్వంతో ముడిపెట్టి అది జరగంది ఇది జరగదని అసలు ఉద్యమాన్ని వెనక్కు నెట్టే గమనం నాకు నచ్చదు.
*             *           *
తత్వశాస్త్రాన్ని, విజ్ఞా శాస్త్రాన్ని జీవితంలో మేళవించి సమగ్రత్వాన్ని కావ్యాల్లో ప్రతిబింబింప చెయ్యాలి. యీ ఆశయం యే రూపంలోనైనా వుండవచ్చు.
*             *           *
సత్యాన్వేషణ, స్వాతంత్ర్యేచ్ఛలను హేతువాదం ద్వారా పరిపక్వంచేసి, మానవునిలో యిమిడివున్న హేతువాద నైతిక ప్రవృత్తులను ప్రకోపింపచేయటమే సాహిత్యపరమావధి.
గాంధీ చెప్పి వుండవచ్చు. ఎం.ఎన్.రాయ్ సిద్ధాంతీకరించి వుండవచ్చు. ధ్యేయాలు, ధ్యేయాన్ని చేరే మార్గాలూ సమంగా వుదాత్తంగా వుండాలని లోకం బాగా గ్రహించలేదు.
*             *           *








AGK is known for his aphotistic saying in Telugu. 

















24, ఏప్రిల్ 2011, ఆదివారం

Famous sayings of AGK

quotations in Telugu from Avula Gopala Krishna Murty writings


పునాదులలో సౌరుగల పాలన ప్రజాస్వామ్యం. తల బరువు దానికి పనికిరాదు. ప్రజలు తమ తమ పనులను, విధులను బాగా చేసుకోగలరనేదే ప్రజాస్వామ్య పాలనకు మూలం.
*             *           *
పత్రికా రచన ఒక నైతిక విక్రియ, పత్రికాలోకం పతితమైతే జాతి జీవనాడుల్లో ఒక ప్రధాన నాడి దెబ్బతిని పోయి జీవనగమనం సురిగిపోయినట్లు భావించవలసివుంది.
*             *           *
అనుశ్రుతలోకం మార్చదలచిన వాణ్ణి మాటలంటుంది. ఆడిపోస్తుంది. మొరాయింపగా, మొరాయిపంగా అంగీకరింపక పోయినా, హర్షింపకున్నా, ఆడిపోయటం అని, సహింప నారంభించి, క్రమ క్రమేణా సహనాన్ని సహకారంగా, హర్షంగా అంగీకరిస్తుంది. లోకవృత్తం అది.
*             *           *
స్వేచ్ఛాపిపాస విద్యకు ప్రాతిపదిక, స్వేచ్ఛకు విద్య కూడా అంతే.
*             *           *
సంస్కృతి అనేది ఒక నామ వాచకం కాదు, అది ఒక క్రియ.
*             *           *
మానవత, వ్యక్తిత్వం, హేతువాదం – యీ మూడు సూత్రాల్ని ప్రధానంగా దృష్టిలో వుంచుకొని, ఆచరణలో అన్వయం చేయగలిగిన విధానాలు, తద్విధానాల ప్రచారకులు రావాలి – అదే నేటి యుగ సమస్య.
*             *           *
మానవుని మనస్సును విప్పార జేసి, స్వేచ్ఛగా భాసింపజేసే, అవరోధాలను తొలగించి, అన్వయాన్ని ప్రథానంగా గరపి, పరులకు నొప్పిలేని రీతిలో నడిపేదీప్తి సంస్కృతి, అది దేశీయము కాదు, జాతీయము కాదు. వర్నయము కాదు. ప్రాంతీయము కాదు. అది జాతి, మత, దేశ, కాలావచ్ఛిన్నంగా నడిచే వికాస, పునర్వికాస వుద్యమం.
*             *           *
స్వేచ్ఛా సక్తులు స్వేచ్ఛకోసం పోరాడాలి. లేకుంటే స్వేచ్ఛ మరణిస్తుంది. స్వేచ్ఛాసక్తులు మరణిస్తే – స్వేచ్ఛ ఆగిపోతుంది – ఈ మాటలతో నాకు ఏకాభిప్రాయం.
*             *           *
విద్య, ధనం   ఈ రెండూ వున్నై, వీటిల్లో విద్య గరీయసి అనే మాటల విలువను మనం గ్రహించాలి.
ఒక దేశపు పౌరుసంపదలు వ్యక్తం కావాలంటే, ఆ దేశానికి భవిష్యత్తు ఉన్నదో లేదో తేలాలంటే అచ్చటి విద్యా విధానాల్ని పరిశీలించి చూస్తే కథ బోధపడుతుంది.
*             *           *
విద్య నెరుంగని వాడు మర్త్యుడే  అనే మాటల్ని నేనంగీకరించను. విద్య నెరుంగనివాడు మర్త్యుడు కాకపోడు. కాని విద్య మనలో విలువల్ని పెంచగలిగితే, విద్యాధికులకున్న స్థానాలు వేరు. వారి సంచాలకత్వంలో రాగలమేళ్ళూ వేరు.
*             *           *
ప్రజాస్వామ్యం సరిగా పరిఢవిల్లాలంటే విద్యావిధానాల్లో ప్రభుత్వం కనీస జోక్యం మాత్రమే కలిగివుండాలి.
*             *           *
పుస్తకాలు జాతీయం చెయ్యడం అంటే బుర్రలు జాతీయం చెయ్యటమే. బుర్రలు జాతీయం చేయటం కన్న కారణం ఏముంటుంది?
*             *           *
భేదాభిప్రాయాలపట్ల మన్ననగలిగి ప్రక్కవాని వ్యక్తిత్వాన్ని గుర్తించి మనం వర్తించ గలిగేటట్లు చూడటం విద్య మూలసూత్రాల్లో వొకటి.
విద్య, స్థానిక సంస్థలు, న్యాయస్థానాలు ప్రజాస్వామ్య సౌధానికి మూడు స్తంభాలు. నాలుగో స్తంభము పత్రికా లోకం, యీ నాల్గుస్తంభాల గురుతు మీదగా ప్రజాస్వామ్య పరిరక్షణ కావించాలి.
*             *           *
వ్యక్తి స్వేచ్ఛ అన్నిటికన్నా ముఖ్యంగా లోకం పుట్టిన నాటనుండి ప్రజాస్వామ్యంలో యెంచబడుతూ వుంది. వ్యక్తి స్వేచ్ఛ వున్నదా లేదా అని తెలిసికోటానికి ఆ వ్యక్తికి వాక్స్వాతంత్ర్యం ప్రధానంగా యెంచబడుతుంది. వాక్సాస్వాతంత్ర్యం వున్నదా లేదా అని తెలిసికోటానికి రెండు స్వాతంత్ర్యాలు ముఖ్యం.  అందులో మొదటిది పత్రికా స్వాతంత్ర్యం. రెండోది సమావేశ స్వాతంత్ర్యం. పత్రికా, సమావేశ స్వాతంత్ర్యాల్లో వాక్స్వాతంత్ర్యానికి రూఢిమ యేర్పడుతుంది.
*             *           *
స్వేచ్ఛను విప్పారజేసి, విస్తృతపరచటమే నా జీవిత లక్ష్యం.
*             *           *
పత్రికాలోకం యెక్కడైనా ప్రజల దృక్పథాలను ప్రభుత్వానికి, ప్రభుత్వ విధాన దృక్పథాలను ప్రజలకు అన్వయం చేస్తూ, యేది యేవేళల వుచితమో వుభయులకు చెప్పుతూ, లోపాలను దిద్దే వేదికగా పనిచెయ్యాలి.
రంగుకు మతంగాని, మనిషిగాని కారణం కాదు. రంగుకు ప్రకృతిలోని శీతోష్ణతలు తప్ప మరొక కారణం లేదు. యిది గ్రహింపని లోపమే జాత్యంహంకారుల బలం! అజ్ఞానం ఆనందాన్నిస్తే, జ్ఞానార్జనకోసం తాపత్రయ పడటం వెర్రికాగలదు.
*             *           *
నియత భావం పనికిమాలినది. ముఖ్యంగా విద్యా రంగంలో అదిమరీ అరిష్టంగా మారుతుంది.
*             *           *
మనకు మతాలవారీ లా పోయి, సివిల్ లా వచ్చి, దేశ పౌరులందరికీ ఒకే చట్టం అన్వయం కావాలి. అప్పుడు వ్యత్యాసం లేని శాసన రాజ్యం ప్రారంభమౌతుంది.
*             *           *
ప్రజాస్వామ్య గతాలే నా రాజకీయాలు, నా సాంఘికాలు – ఆ లెక్క కొస్తే నా మానవీయాలన్నీ.
*             *           *
సాంఘిక న్యాయం జరగాలంటే ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక ప్రజాస్వామ్యాలు ఆచరణలోకి రావాలి. కేంద్రీకృత విధానాలు పోయి, వికేంద్రీకృత విధానాలు రావాలి.
నాలో కులపర్వతాలే ఘూర్జిల్లిపోతై. ఇక చిన్న చిన్న సమస్యలు, పెద్దపెద్దపార్టీ లేమి పనికివస్తై.
*             *           *
సమాజాన్ని విప్పారే రీతుల్లో నిర్మించటం జరగాలి. సమాజంలో వికాసం రావాలంటే, భావుకత క్రిందనుంచి పైకి రావాలిగాని, పై నుంచి క్రిందికి నియతరీతిని రాగూడదు.
*             *           *
మానవుడు వ్యక్తిగా వికాసాన్ని పొంది, తాను భావసమాజ నిర్మాణంలో పునాదిగా వుండగలిగిన యేర్పాట్లను మనం పరిశీలించి,  గమనించుకోవాలి. నినాదాలు కృషికి ప్రత్యామ్నాయాలు కావు.
*             *           *
ప్రభుత్వం తనకుతానై అన్నిరంగాల్లోకి రాగూడదు. ప్రభుత్వం వచ్చిన చోట సమిష్టిపేరుతో వికాస భ్రష్టత జరుగుతుంది.
*             *           *
మానవుణ్ణి వ్యక్తిగా, సమిష్టి ఆచారదారునిగా మనం పునః పరిశీలన చేసి, శాస్త్రీయ విజ్ఞానంతో తిరిగి కొలవాలి. మానవుణ్ణి అట్లా కొలవగా నిలిచిన నవీన విలువలు సమాజ నిర్మాణానికి ప్రాతిపదికలు కావాలి.
పెండ్లిలో నక్షత్రాల పెత్తనం, గోళాల పెత్తనం, గోళాల యజమాయిషి, చంద్ర సూర్యాదుల నిమిత్తం ఏమీ లేదు. పంచాంగ నియత బద్ధులమైనన్నినాళ్ళూ యీ సాంఘిక వృత్తంలో శాస్త్ర దాస్యయుగం జరుగుతున్నట్లే యెంచాలి.
*             *           *
సమాజంలో పెండ్లి మనలో యిద్దరి వొప్పదంగా, కంట్రాక్టుగా నడవాలి. ఒప్పందందార్లలో సమాన ప్రతిపత్తి మాత్రమే వుంటుందని గ్రహించాలి. వివాహం యిద్దరి మేలికలయిక.
*             *           *
వివాహానికి మతం ప్రాతిపదికగా అనాదినుంచి వుంది. అది మారాలి. మతానికి, పెండ్లికి నిజానికి సంబంధం లేదు. సివిల్ వివాహ పద్ధతులు రావాలి. దేశపౌరులందరకు ఒకే విధమైన సివిల్ లా వర్తించాలి. అప్పుడు మనదేశం పూర్వ చరిత్ర గతుల నుండి బయటపడి నవీనపు రంగుల్ని తాల్చగలదు.
*             *           *
మీ పెండ్లికి యేమి కావాలండీ అన్నారొక పెద్ద, నేనొక పెండ్లి చేయించటానికి వెళ్ళగా. పెండ్లికొడుకు, పెండ్లి కూతురు కావాలి – మరేమీ అవసరం లేదుఅన్నాను. అ పెద్ద కొంచెం తమాయించి, సూత్రం సంగతేమంటారన్నాడు. అవసరం లేదు అని అన్నాను.
పెండ్లి దైవదత్తం కాదు. మనిషి కృషి. పెండ్లిండ్లు స్వర్గంలో దైవసన్నిధిలో జరుగవు. లోకంలో, సమాజంలో జరుగుతై.
*             *           *

లోకం మారాలి. లోకాన్ని మార్చాలి. మారిన విధులూ, మంచి విధులూ రావాలి.
*             *           *
పెండ్లి కుటుంబ వ్యవస్థకు, సమాజవ్యవస్థకు మూలం. పెండ్లి లేక నాగరికతగాని, సరియైన అభ్యుదయంగాని వుండవు.
*             *           *
భార్యాభర్తలిద్దరు సమానమైన ప్రతిపత్తిగల వారై యుండాలి. న్యూనతకు చోటులేని సాహచర్యం నాందిగా వుండాలి. అట్టి సమాన సంపత్తి, ప్రతిపత్తిగల స్త్రీ, పురుషుడు యిష్టపూర్తిగా తాము ఒక సంబారాన్ని నిర్వహించాలని నిర్ణయించుకోవాలి. వారికి అంగీకారం, ప్రేమ, అనురాగాలు బంధాలుగా వుంటై. దీనికి మతం గాని, నమ్మకంగాని,  మౌఢ్యంగాని, ధనంగాని మూలంకాదు, కారాదు. పెండ్లిలో స్వార్థం వుంది. సాంఘికత వుంది. వ్యక్తి కుటుంబంలోకి, కుటుంబం సంఘంలోకి పొడిగింపబడే అదనేగదా పెండ్లి. నిజానికి జీవితంలో వ్యక్తికి పెండ్లికి మించిన పండగలేదు.
హ్యూమనిస్టుగా నేను యుద్ధానికి వ్యతిరేకిని. అయితే యుద్ధం వచ్చినప్పుడు ప్రతిఘటించరాదనే పసిఫిస్టును కాను. మనం ఇతరుల భూభాగాలను ఆక్రమించాలనిగాని, కబళించాలనిగానీ నేను కోరను. దురాక్రమణను హింసతో అవసరమైన మేరకు నేను ప్రతిఘటిస్తాను. నాది సైనిక మనస్తత్వం కాదు. ఏ హ్యూమనిస్టూ సైనిక మనస్తత్త్వానికి చెందడు.
*             *           *
పెద్దవాళ్ళకు వికారాలు జాస్తి, పిల్లవాళ్ళకు విహారాలు జాస్తి. వినోదాలు పిల్లల ఆస్తి. విక్రీడలు వారి సొత్తు. వారి సహజాతాలను పెంచటమే, వరపిడిలేని రీతిని సమన్వయించటమే మన ప్రధాన కర్తవ్యం.
*             *           *
నేను లేక సంఘంలేదు. సంఘం లేకుండా నేనువున్నాను. వుండగలనన్న నైసర్గిక యాదార్థ్యతను గుర్తించిన వాణ్ణి అయినా, సమాజంలో, సంఘంలో నేను ఒక పూసను. ఆమణి మేఖలలో, నాస్థానం నాదే అన్న అహం కలిగి, అహంకారం లేకుండా, అహం బ్రహ్మాస్మిలోని రాగరహిత భావాన్ని గ్రహించాను.
*             *           *
Unique quotations from the writings of AGK