25, మార్చి 2011, శుక్రవారం

సాహిత్య మాగానుల్లో ఏటుకూరి వెంకట నరసయ్య

ఏటుకూరి వెంకట నరసయ్య


(స్మారక సంచిక నుండి-1948)

ఏటుకూరి ఆంధ్ర సాహిత్యలోకానికి చిరపరిచితులు. ఆంధ్ర ప్రజల ఆదరాభిమానములను పొందినవారు. ఇరవై సంవత్సరాలు తెలుగు సాహిత్య మాగానుల్లో విహరిస్తూ, పట్టుతప్పని స్వాతంత్ర్య గరిమజూపి తెలుగు భాషకు కొత్తరికాన్ని తెచ్చిపెట్టిన నిర్భయ పలవాటికవి.
నరసయ్య విశిష్టకవి. భాషాపాండిత్యం, కవితా హృదయం సమపాళ్ళుగా పొదుపు చూపిన పండితకవి. కవి పండితుడు. భావమందు శైలియును, భాసుర శైలిని మించు భావము కలిగినవాడు. అతడొక కావ్య తపస్వి. చేతికివచ్చినదల్లా వ్రాయక, ఒక నియమం. ఒక భావం, ఒక ప్రణాళిక కలిగించాడు. ఒక్కొక్క కృతిని ఒక్కొక్క రీతికి నిగళసూత్రంగా చిత్రించి, వెలార్చినవాడు.
సుద్దులతో సాహిత్యంలో అడుగుపెట్టి, నీతిమంజరి రచించి, రైతుగాథల్లో శ్రావ్య కవితాగాన స్రవంతుల నుంచి క్షేత్రలక్ష్మిని నిగదించి, ప్రేమమయ జీవితాన్ని ఆకాంక్షించి, ప్రేమాలోకం నిలకడగల నుగ్గుదేరిన తెనుగునుడికారంతో నింపివేసి, కథలో పాత్రల్లో, కవిత్వంలో అందెవేయించి, .మగువ మాంచాల”, “నాయకురాలు”, “రుద్రమలను స్త్రీత్వప్రాతినిధ్య ప్రతిభా విభాసినులనుగాయేర్చి, కూర్చి తెలుగు తల్లుల మగటిమ చూపాడు.
సంస్కృతంలో నరసయ్య, వరుసలుగా పరవళ్ళు త్రొక్కే రీతిలో రచన చేయగలిగిన సత్తాను చూపాడు.
కవిబ్రహ్మ తాను మాటిమాటికి పలనాటి వాడనన్న, అహం, మరచేవాడు కాదు. అందుకే పలనాడన్న దిగంత అని యెంతగానో దొర్లించేవారు.
పలనాటిని బయటికి లాగాడు. భారతాన్ని లేవదీశాడు. అది కవిత్రయ భారతం. వాగమశాసనులు. కవిబ్రహ్మలు, ప్రబంధ పరమేశ్వరులు రచించినది, ఇది యేకైక కవి భారతం, తానే వాగను శాసనునిగా, ప్రబంధ పరమేశ్వరునిగా కవి బ్రహ్మగా రూపొంది, విజ్జి రాల్చినాడు. తిక్కయజ్వ తానై రహిమై వెలార్చినాడు.
అది వుత్తరాదివారిగాథ, యిది తెలుగు జోదుల వీరగాథ, అందుకే వీరభారతం.
కవి బహుముఖ పాండిత్యాన్ని ప్రకర్షించటమేకాక, తన సాంఘికాభిరుచుల్ని మనోజ్ఞ రీతుల్లో త్రివేణిగా చూపాడు.
అసలు తిక్కనదొట్టి నేటివరకు లేని తెలుగుదనాన్ని తెలుగు భాషలో చూపిన సాహసాంకుడు. ప్రాత క్రొత్తలందుల్లముసేర్చి, తనకొల్లనిదేమి.... లేక రసస్వరూపాన్ని, శబ్ద స్వరూపాన్ని నూతనాకృతిలో నిగదించాడు. తెలుగుకు అమూల్యమైన సేవ చేశాడు. ఆయన కావ్యాకృతిలోకి తెచ్చిన పదాలు, చేర్చిన మాటలు తండోప లబ్ధిగావున్నవి. అవి ఆయన విశిష్టతను చాటగలవు. జీవద్భాషగా తెలుగుకు పరిపుష్టి, తుష్టికూర్చినాడు మన సరసకవి.
సమకాలిక సాహిత్యరంగంలో నాలుగు కాలాలపాటు నిల్వగల్గి రచనలు చేసిన వారిని వేళ్ళమీద లెక్కించవచ్చును. అందులో వేంకటనరసయ్య ఒకరు. వారి కావ్యరచనా విశ్వాసాన్ని మగువ మాంచాలలో చూడవచ్చును. మాంచాల మనోజ్ఞమైన సృష్టి. వీరభారతం పెద్దకోవకు చెందిన రచన. ప్రణాళికాబద్ధ రచన. అలరాజు రాయబారంలో తిక్కన పోకడలను, తిక్కన రచనలుగా, ఆయీ కవిబ్రహ్మల భాషా సామ్రాజ్య సామ్యాన్ని చూపాడు. మరెన్నో ప్రణాళికలు కలవు. తీరని రీతిలో కవి అంతరించటం తెలుగు సాహిత్యానికే కుంటుతనం వచ్చింది. స్నేహితుడుగా వేంకట నరసయ్య వెన్నపూసలాంటి వాడు. వాక్కులో కాఠిన్యత లేకపోలేదు,. ఆయన వీరభారతం అసమగ్రంగానే వుంది. కవిబ్రహ్మకు వుద్దీ యెప్పుడు వచ్చి, యీ పురాణభారం వహిస్తాడో చూడవలసి వుంది.
Avula Gopalakrishna Murty contributed this tribute in 1948 to Etukuri Venkatanarasaiah